వారానికి ఒక్క ఇంజెక్షన్తో మధుమేహ నియంత్రణ..
డెన్మార్క్కు చెందిన ఔషధ సంస్థ నోవో నోర్డిస్క్, ప్రతిరోజూ ఇన్సులిన్ ఇంజెక్షన్లు తీసుకోవాల్సిన భయాన్ని తగ్గిస్తూ, వారానికి ఒక్కసారి మాత్రమే తీసుకునే కొత్త బేసల్ ఇన్సులిన్ అవిక్లీ (ఇన్సులిన్ ఐకోడెక్)ను భారత్లో విడుదల చేసింది. ప్రపంచంలో ఈ ఔషధాన్ని ప్రవేశపెట్టిన ఆరో దేశంగా భారత్ నిలిచింది. కంపెనీ తెలిపిన ప్రకారం, ఇది ప్రపంచంలోనే తొలి వారానికి ఒక్కసారి తీసుకునే బేసల్ ఇన్సులిన్ ఇంజెక్షన్ కావడం విశేషం. ఈ చికిత్సతో ఏడాదిలో తీసుకోవాల్సిన ఇంజెక్షన్ల సంఖ్య 365 నుంచి కేవలం 52కు తగ్గుతుంది. టైప్-1, టైప్-2 మధుమేహంతో బాధపడుతున్న వారికి ఈ ఔషధానికి అనుమతి లభించింది. నోవో నోర్డిస్క్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ విక్రాంత్ శ్రోత్రియా మాట్లాడుతూ అవిక్లీని ఒక విప్లవాత్మక ఉత్పత్తి అని కొందరు అంటున్నారని, కానీ తాను దీన్ని టైప్-2 మధుమేహ రోగులకు ఒక పరిష్కారంగా చూస్తున్నానని తెలిపారు.
భయంతో ఇన్సులిన్ తీసుకోవడం లేదు..
భారత్లో ప్రస్తుతం 10.1 కోట్ల మందికిపైగా మధుమేహంతో జీవిస్తున్నప్పటికీ, ఇన్సులిన్ వినియోగం ఇంకా చాలా తక్కువగానే ఉందని ఆయన చెప్పారు. ప్రస్తుతం కేవలం 60 నుంచి 70 లక్షల మంది మాత్రమే ఇన్సులిన్ ఉపయోగిస్తున్నారని, అయితే మొత్తం రోగుల్లో సుమారు 25 నుంచి 30 శాతం మందికి ఇన్సులిన్ ప్రారంభించాల్సిన అవసరం ఉంటుందని వివరించారు. చాలామంది రోగులు ప్రతిరోజూ ఇంజెక్షన్లు తీసుకోవాల్సి వస్తుందనే భయంతో ఇన్సులిన్ చికిత్సను ప్రారంభించడాన్ని వాయిదా వేస్తున్నారని ఆయన పేర్కొన్నారు. వారానికి ఒక్కసారి మాత్రమే తీసుకునే బేసల్ ఇన్సులిన్ అందుబాటులోకి రావడంతో ఆ భయం గణనీయంగా తగ్గుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
అందుబాటు ధరల్లోనే..
అవిక్లీ ధరలను కూడా భారత మార్కెట్కు అనుగుణంగా పోటీ స్థాయిలో నిర్ణయించినట్లు నోవో నోర్డిస్క్ వెల్లడించింది. 700 ఇన్సులిన్ యూనిట్లు కలిగిన 1 మిల్లీలీటర్ అవిక్లీ పెన్ ధరను రూ.2,611గా నిర్ణయించగా, 2,100 యూనిట్లు కలిగిన 3 మిల్లీలీటర్ పెన్ ధర రూ.7,883గా ఉంది. వారానికి సుమారు 70 యూనిట్ల మోతాదు తీసుకునే రోగికి ఈ చికిత్స ఖర్చు వారానికి దాదాపు రూ.261 నుంచి రూ.263 వరకు ఉంటుందని కంపెనీ తెలిపింది. భారత్లో ప్రస్తుతం అందుబాటులో ఉన్న అనలాగ్ ఇన్సులిన్లతో పోలిస్తే ఈ ఔషధాన్ని మరింత అందుబాటు ధరలో తీసుకొచ్చామని విక్రాంత్ శ్రోత్రియా చెప్పారు. తక్కువ ఇంజెక్షన్లు, పోటీ ధరలు, దేశవ్యాప్తంగా ఉన్న పంపిణీ వ్యవస్థ కలిసివచ్చి అవిక్లీని భారీ స్థాయిలో ప్రజల్లోకి తీసుకెళ్తాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
భయంతో ఇన్సులిన్ తీసుకోవడం లేదు..
భారత్లో ప్రస్తుతం 10.1 కోట్ల మందికిపైగా మధుమేహంతో జీవిస్తున్నప్పటికీ, ఇన్సులిన్ వినియోగం ఇంకా చాలా తక్కువగానే ఉందని ఆయన చెప్పారు. ప్రస్తుతం కేవలం 60 నుంచి 70 లక్షల మంది మాత్రమే ఇన్సులిన్ ఉపయోగిస్తున్నారని, అయితే మొత్తం రోగుల్లో సుమారు 25 నుంచి 30 శాతం మందికి ఇన్సులిన్ ప్రారంభించాల్సిన అవసరం ఉంటుందని వివరించారు. చాలామంది రోగులు ప్రతిరోజూ ఇంజెక్షన్లు తీసుకోవాల్సి వస్తుందనే భయంతో ఇన్సులిన్ చికిత్సను ప్రారంభించడాన్ని వాయిదా వేస్తున్నారని ఆయన పేర్కొన్నారు. వారానికి ఒక్కసారి మాత్రమే తీసుకునే బేసల్ ఇన్సులిన్ అందుబాటులోకి రావడంతో ఆ భయం గణనీయంగా తగ్గుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
అందుబాటు ధరల్లోనే..
అవిక్లీ ధరలను కూడా భారత మార్కెట్కు అనుగుణంగా పోటీ స్థాయిలో నిర్ణయించినట్లు నోవో నోర్డిస్క్ వెల్లడించింది. 700 ఇన్సులిన్ యూనిట్లు కలిగిన 1 మిల్లీలీటర్ అవిక్లీ పెన్ ధరను రూ.2,611గా నిర్ణయించగా, 2,100 యూనిట్లు కలిగిన 3 మిల్లీలీటర్ పెన్ ధర రూ.7,883గా ఉంది. వారానికి సుమారు 70 యూనిట్ల మోతాదు తీసుకునే రోగికి ఈ చికిత్స ఖర్చు వారానికి దాదాపు రూ.261 నుంచి రూ.263 వరకు ఉంటుందని కంపెనీ తెలిపింది. భారత్లో ప్రస్తుతం అందుబాటులో ఉన్న అనలాగ్ ఇన్సులిన్లతో పోలిస్తే ఈ ఔషధాన్ని మరింత అందుబాటు ధరలో తీసుకొచ్చామని విక్రాంత్ శ్రోత్రియా చెప్పారు. తక్కువ ఇంజెక్షన్లు, పోటీ ధరలు, దేశవ్యాప్తంగా ఉన్న పంపిణీ వ్యవస్థ కలిసివచ్చి అవిక్లీని భారీ స్థాయిలో ప్రజల్లోకి తీసుకెళ్తాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.