🏠 www.bvknews.com
Watermark
Newspaper Logo
www.bvknews.com | Date: 17 Jul, 2026 | Page: 1

TSCPSEU జిల్లా అధ్యక్షులు N. కృపాకర రెడ్డి ఆధ్వర్యంలో జన జాగరణ గోడపత్రిక ఆవిష్కరణ

నారాయణపేట, జులై 17 (బివీకే న్యూస్)
నారాయణ్ పేట జిల్లా మఖ్తల్ మండలంలోని ఏరియా ఆసుపత్రిలో, MPDO ఆఫీసు లో శుక్రవారం TSCPSEU జిల్లా అధ్యక్షులు N. కృపాకర రెడ్డి ఆధ్వర్యంలో జన జాగరణ పోస్టర్ ఆవిష్కరణ చేయడం జరిగింది.
ఈ కార్యక్రమం లో TSCPSEU జిల్లా సెక్రటరీ S. రాఘవేంద్ర చారి, కోశాధికారి సత్యపాల్ గారు, మరియు , మునెప్ప గోపాల్, వెంకటప్ప శ్రీ మతి శ్రీ లత, శేఖర్, చంద్ర శేఖర్, మధు ఇంతియాజ్, సూపర్డెంట్ డాక్టర్ వినుత, ఏవో గంగాధర్ సెక్షన్ క్లర్క్ యాదగిరి MPDO ఆఫీస్ ఉద్యోగులు మధుకిరణ్ సాయినాథ్ శరత్ మహేష్ వరలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షులు సకిరం మహాదేవ్, TGJAC జిల్లా కో చైర్మెన్ M. దామోదర్ లు మాట్లాడుతూ తేదీ జులై-19 రోజు మఖ్తల్ రామ్ లీల మైదానం నుంచి ఉదయం 9:00 గంటలకు బయలు దేరి నారాయణ్ పేట జిల్లా కేంద్రంలో జరిగే "జన జాగరణ యాత్రలో పాల్గొనాలని పిలుపు నిచ్చారు.
జన జాగరణ యాత్రకు పూర్తి సహకారంతో నారాయణ్ పేట లో జూలై 19 జరిగే బైక్ ర్యాలీకి అందరు తమ వంతుగా పాల్గొని విజయవంతం చేస్తామని CPS రద్దుకు మేము సైతం అని చెప్పడం జరిగింది.
🏠 Home