పేపర్ లీక్లపై కఠిన చట్టం తీసుకొస్తున్నాం- చర్చలో అన్ని పార్టీలు పాల్గొనాలి : కిరణ్ రిజిజు
పరీక్షల నిర్వహణలో అక్రమాలను నిరోధించేందుకు ఉద్దేశించిన చట్ట సవరణ బిల్లును కేంద్రం సోమవారం పార్లమెంట్లో ప్రవేశపెట్టనుంది. పరీక్షల్లో అక్రమాలను అడ్డుకట్ట వేసేందుకు కేంద్ర ప్రభుత్వం ఈ కఠిన చట్టాన్ని తీసుకొస్తాందని కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు తెలిపారు. పబ్లిక్ ఎగ్జామినేషన్స్ (ప్రివెన్షన్ ఆఫ్ అన్ఫెయిర్ మీన్స్) సవరణ బిల్లు-2026పై లోక్సభలో జరిగే చర్చలో అన్ని రాజకీయ పార్టీలు పాల్గొనాలని ఆయన కోరారు. పార్లమెంట్ సమావేశాలకు ముందు మీడియాతో మాట్లాడుతూ ఈ మేరకు వ్యాఖ్యలు చేశారు.
'ఇది చాలా ముఖ్యమైన రోజు. దేశంలో జరిగిన ప్రశ్నపత్రాల లీకేజీలు, ఇటీవల విద్యార్థులు చేపట్టిన నిరసనల నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ కీలక నిర్ణయాలు ప్రకటించారు. ఇప్పుడు వాటికి చట్టబద్ధ రూపం కల్పించేలా సవరణ బిల్లును లోక్సభలో ప్రవేశపెడుతున్నాం. ఈ చర్చలో అన్ని పార్టీలు పాల్గొనాలని కోరుతున్నాం. అయితే ఇలాంటి సమయంలో చర్చలో పాల్గొనకుండా సభను అడ్డుకోవడం ప్రజలకు సరైన సందేశం ఇవ్వదు. సభలో గందరగోళం సృష్టించడం కంటే బిల్లుపై చర్చలో పాల్గొని తమ అభిప్రాయాలను వెల్లడించాలి' అని రిజిజు సూచించారు.
'ఇది చాలా ముఖ్యమైన రోజు. దేశంలో జరిగిన ప్రశ్నపత్రాల లీకేజీలు, ఇటీవల విద్యార్థులు చేపట్టిన నిరసనల నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ కీలక నిర్ణయాలు ప్రకటించారు. ఇప్పుడు వాటికి చట్టబద్ధ రూపం కల్పించేలా సవరణ బిల్లును లోక్సభలో ప్రవేశపెడుతున్నాం. ఈ చర్చలో అన్ని పార్టీలు పాల్గొనాలని కోరుతున్నాం. అయితే ఇలాంటి సమయంలో చర్చలో పాల్గొనకుండా సభను అడ్డుకోవడం ప్రజలకు సరైన సందేశం ఇవ్వదు. సభలో గందరగోళం సృష్టించడం కంటే బిల్లుపై చర్చలో పాల్గొని తమ అభిప్రాయాలను వెల్లడించాలి' అని రిజిజు సూచించారు.