ఆర్టీఐ ఆక్టివిస్ట్ సొసైటీ( ఆర్టీఐ ఏఎస్ ) ఆధ్వర్యంలో కరీంనగర్ జిల్లాలో నూతన కమిటీ నియామకం
దేవరకొండ 28జూలై (BVK 3 న్యూస్ ) : కరీంనగర్ జిల్లా కేంద్రంలో ఆర్టీఐ ఆక్టివిస్ట్ సొసైటీ నూతన జిల్లా కమిటీ నియామక కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆర్టీఐ ఆక్టివిస్ట్ సొసైటీ రాష్ట్ర అధ్యక్షుడు డా. కొర్ర కిషన్ నాయక్ సమక్షంలో 18 మంది సభ్యులకు నియామక ఉత్తర్వులు అందజేశారు.ఈ సందర్భంగా నూతనంగా నియమితులైన కమిటీ సభ్యులను శాలువాలతో సత్కరించి అభినందించారు. కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు డా. ఎం.డి. జిలాని, రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు శ్రీకాంత్ గుప్తా, కరీంనగర్ గౌరవ అధ్యక్షులు శ్రీనివాస్, జిల్లా అధ్యక్షులు కె. మల్లయ్య, జిల్లా లీగల్ అడ్వైజర్ కె. సౌమిత్ర, జిల్లా ప్రధాన కార్యదర్శి ప్రియదర్శిని, జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీనివాస్ చారితో పాటు పలువురు ఆర్టీఐ కార్యకర్తలు పాల్గొన్నారు.ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షుడు డా. కొర్ర కిషన్ నాయక్ మాట్లాడుతూ, సమాచార హక్కు చట్టంపై ప్రజల్లో అవగాహన పెంచుతూ పారదర్శక పాలనకు ఆర్టీఐ కార్యకర్తలు కృషి చేయాలని సూచించారు.
నూతనంగా నియమితులైన కమిటీ సభ్యులు తమపై ఉంచిన నమ్మకానికి రాష్ట్ర నాయకత్వానికి కృతజ్ఞతలు తెలియజేస్తూ, ప్రజా సమస్యల పరిష్కారం కోసం చట్టబద్ధంగా సేవలందిస్తా
నూతనంగా నియమితులైన కమిటీ సభ్యులు తమపై ఉంచిన నమ్మకానికి రాష్ట్ర నాయకత్వానికి కృతజ్ఞతలు తెలియజేస్తూ, ప్రజా సమస్యల పరిష్కారం కోసం చట్టబద్ధంగా సేవలందిస్తా