వేసవి సెలవుల ముగింపు.. యాదాద్రి లక్ష్మీనరసింహుడి దర్శనానికి పోటెత్తిన భక్తులు
వేసవి సెలవులు ముగింపు దశకు చేరుకోవడంతో యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహ స్వామి ఆలయానికి భక్తుల రద్దీ పెరిగింది. ఆదివారం తెల్లవారుజాము నుంచే హైదరాబాద్ సహా రాష్ట్రంలోని నలుమూలల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు యాదాద్రికి పోటెత్తారు. భక్త జనసందోహంతో ఆలయ పరిసరాలు కిటకిటలాడాయి.
లక్ష్మీనరసింహ స్వామి వారి ప్రత్యేక దర్శనానికి సుమారు రెండు గంటల సమయం పడుతుంది. ధర్మదర్శనానికి మూడు గంటల సమయం పడుతుంది. రద్దీ దృష్ట్యా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లుగా ఆలయ అధికారులు వెల్లడించారు
లక్ష్మీనరసింహ స్వామి వారి ప్రత్యేక దర్శనానికి సుమారు రెండు గంటల సమయం పడుతుంది. ధర్మదర్శనానికి మూడు గంటల సమయం పడుతుంది. రద్దీ దృష్ట్యా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లుగా ఆలయ అధికారులు వెల్లడించారు