మత్స్యకారులకు దొరికిన పది కిలోల రవ్వు(బొచ్చా) చాప
శంకరపట్నం:
శంకరపట్నం మండలం కేశవపట్నం గ్రామంలో ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో ఆదివారం యాపకుంట చెరువులో మత్స్యకారులు చేపలు పడుతుండగా పది కీలోల రవ్వు( బొచ్ఛా)చాప వలలో చిక్కింది.దాదాపు ఆ చెరువులో పది కిలోల పైనే చేపలు ఉన్నట్టు మత్స్యకారులు తెలిపారు. మత్స్యకారులు మాట్లాడుతూ...మృగశిర మాసంలో చాపలు ఎప్పుడు తిన్న ఆరోగ్యానికి మంచిదని,మృగశిర మాసంలో చాపలు తినడం వల్ల హస్తమా, ఉబకాయం,వంటి వ్యాధులు నయమవుతాయని అందువల్లనే మృగశిర మాసంలో చాపలను ప్రత్యేకంగా తింటారని మత్స్యకారులు తెలిపారు.
REPORTER
PALLE SWARUPA
SHANKARAPATNAM