🏠 www.bvknews.com
Watermark
Newspaper Logo
www.bvknews.com | Date: 17 Jun, 2026 | Page: 1

హనీమూన్‌లో విషాదం.. ముస్సోరిలో తెలుగు టెకీ అనుమానాస్పద మృతి..

ఉత్తరాఖండ్‌లోని ముస్సోరిలో తెలుగు టెకీ అనుమానాస్పద స్థితిలో మరణించారు. పోలీసుల కథనం ప్రకారం ఏపీలోని విశాఖపట్నంకు చెందిన రాధా గాయత్రి, శ్రీచరణ్‌లకు గత ఏడాది నవంబర్‌ 8న వివాహం జరిగింది. గాయత్రి గురుగ్రామ్‌లో ఒక ఐటీ సంస్థలో పనిచేస్తూ ఢిల్లీలో ఉంటున్నది. ఆమె భర్త శ్రీచరణ్‌ పుణెలో ఒక ఐటీ సంస్థలో పనిచేస్తున్నాడు. వీరిద్దరూ హనీమూన్‌లో భాగంగా ఢిల్లీ నుంచి రిషికేశ్‌ వెళ్లారు. తర్వాత ముస్సోరిలోని టిప్రీధర్‌ హోం స్టేలో 14వ తేదీ రాత్రి 11.30 గంటలకు దిగారు.
తర్వాత ఇద్దరూ మద్యం సేవించి 3.30 గంటలకు పడుకున్నారు. పొద్దుట లేచి చూసేసరికి భార్య నగ్నంగా రక్తపు, మూత్రం మడుగులో నేలపై పడి ఉండగా, ఆమె ముక్కు నుంచి రక్తం కారుతూ అచేతనంగా పడి ఉండటాన్ని భర్త గుర్తించాడు. ఘటనా స్థలికి చేరుకున్న ముస్సోరి పోలీసులు అంబులెన్స్‌లో ఆమెను దవాఖానకి తరలించారు. అయితే అప్పటికే మరణించినట్టు డాక్టర్లు ధ్రువీకరించారు. దీంతో మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం తరలించి పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
🏠 Home