ప్రత్యేక ఓటరు సవరణ ప్రక్రియ వేగవంతం…
సిద్దిపేట పట్టణంలో ప్రత్యేక ఓటరు సవరణ కార్యక్రమం గురువారం ప్రారంభం కాగా పట్టణంలోని 6వ వార్డులో బీఎల్ఓలు ఇంటింటికీ తిరుగుతూ ఓటర్లకు ఎన్యూమరేషన్ పత్రాలను అందజేస్తున్నారు.ఈ సందర్భంగా బీఎల్ఓ మల్లేశ్వరి, మాజీ కౌన్సిలర్ సాయి పత్రాలపై ముద్రించిన క్యూఆర్ కోడ్ను మొబైల్ ఫోన్ ద్వారా స్కాన్ చేసే విధానాన్ని ఓటర్లకు వివరించి, వారు అడిగిన పలు సందేహాలకు సమాధానాలు ఇస్తున్నారు. ఇప్పటివరకు వార్డులో సుమారు 90 శాతం మ్యాపింగ్ ప్రక్రియ పూర్తయిందని, మిగిలిన ప్రక్రియను కూడా త్వరితగతిన పూర్తి చేయనున్నట్లు నిర్వాహకులు తెలిపారు.