వ్యవసాయ సాగునీటి విడుదల కార్యక్రమం
దేవరకొండ 29జూన్ (BVK 3 న్యూస్ ) : డిండి చెరువు ఆయకట్టు కింద ఉన్న 'స్తంభాల బండ చెరువు' నుండి తెలుగుపల్లి, కామేపల్లి, ఎర్రారం గ్రామాల్లోని రైతులకు వరి నాట్లు వేసేందుకు సాగునీటిని విడుదల చేశారు.ఈ కార్యక్రమానికి తెలుగుపల్లి సర్పంచ్ చాట్ల రమాదేవి రాములు మరియు నీటి సంఘం చైర్మన్ తిప్పర్తి రుక్మారెడ్డి ముఖ్య అతిథులుగా హాజరై, సాగునీటిని విడుదల చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, రైతులకు నీటిని వృథా చేయకుండా సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కాల్వలను సకాలంలో శుభ్రం చేసుకోవడం ద్వారా పంటలకు ఎటువంటి అంతరాయం కలగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని వారు రైతులకు పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో వర్క్ ఇన్స్పెక్టర్ కరుణాకర్, సుల్స్ మాన్, జల్లెల్ల నరసింహ, నూనె రామస్వామి, తిప్పర్తి అంజలి రెడ్డి, దొంతం విద్యాసాగర్ రెడ్డి, దగు రమేష్, చట్ల శంకర్, దగు యాదయ్య, ఈమ్మరాజు వెంకయ్య మరియు ఇతర గ్రామ పెద్దలు పాల్గొన్నారు.