దేవరకొండలో అజ్ఞాత దాత ఉదారత: పది పేద కుటుంబాలకు బియ్యం, నిత్యావసర సరుకుల పంపిణీ

దేవరకొండ 08జూలై (BVK 3 న్యూస్ ) : దేవరకొండ ప్రభుత్వ పెన్షనర్స్ సేవాసధనంలో అజ్ఞాతవాసి దేవరకొండ నివాసి, పద్మశాలి నేత 10 మంది బీదకుటుంబాలకు బియ్యం, నిత్యావసరం సరుకులు కార్యవర్గ సభ్యులు ముసిని వీరయ్య ద్వారా అందజేసినారు. ఈ సందర్బంగా ప్రధాన కార్యదర్శి అంకం చంద్రమౌళి, కోశాధికారి పంగునూరు లింగయ్య, జిల్లా ఉపాధ్యక్షులు కంచర్ల నారాయణ రెడ్డి మాట్లాడుతూ దేవరకొండ అజ్ఞాత పద్మశాలి నేత బీదలకు బియ్యం,నిత్యావసరం అందజేసి తన పేరు చెప్పకపోవడం వారి గొప్ప మనసుకు నిదర్శనం అన్నారు. ఈ కార్యక్రమంలో సహ అధ్యక్షులు గంగిడి నారాయణ రెడ్డి, ఉపాధ్యక్షులు ఆకులపల్లి ఇజాక్, సంయుక్త కార్యదర్శి వనం బుచ్చయ్య, ప్రచార కార్యదర్శి పగిడిమర్రి...