వేములవాడ రాజన్నకు భక్తుడి రూ.7 లక్షల విరాళం - 'హెల్త్ కండీషన్​ బాలేదు' ప్లీజ్​ తిరిగిచ్చేయండంటూ కుమార్తెల రిక్వెస్ట్​

: ఆ దంపతులు తమ ఏడుగురు కుమార్తెలందరికీ వివాహాలు చేసి, జీవిత చరమాంకానికి చేరుకున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని వేములవాడ రాజరాజేశ్వర స్వామికి పరమ భక్తులైన వారు, తమ దగ్గరున్న డబ్బునంతా రాజన్న నిత్యాన్నదాన ట్రస్టుకు డొనేషన్​ కింద అందజేశారు. అయితే తమ నాన్నకు మతి స్థిమితం సరిగా లేదంటూ ఆయన కుమార్తెలు తర్వాత ఆలయానికి వచ్చి విరాళం వెనక్కి ఇవ్వాలని అడిగిన ఉదంతమిది. వారి అంగీకారం మేరకే తీసుకున్నాం : వేములవాడకు చెందిన వృద్ధ దంపతులు సోమవారం రాజన్న ఆలయానికి రూ.7,01,116ను విరాళంగా సమర్పించారు. ఆలయ పర్యవేక్షకుడు శ్రీనివాస్‌ శర్మ, ప్రొటోకాల్‌ పర్యవేక్షకుడు శ్రీనివాస్‌లు వారికి రసీదును అందజేశారు. అయితే తమ తండ్రికి మతిస్థిమితం...