'విద్యార్థుల వెంటే ప్రభుత్వం- నీట్ పేపర్ లీక్ దోషులపై కఠిన చర్యలు'- NDA మీటింగ్లో మోదీ
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నీట్ పేపర్ లీక్ వ్యవహారంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మొదటిసారిగా స్పందించారు. ఇది జాతీయ సమస్య అని, దోషులను కఠినంగా శిక్షించాలని అన్నారు. దిల్లీలోని పార్లమెంట్ లైబ్రరీ భవనంలోని జీఎంసీ బాలయోగి ఆడిటోరియంలో 'మంగళ్ మిలన్' పేరుతో జరిగిన ఎన్డీఏ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో పాల్గొన్న ప్రధాని మోదీ ఈ మేరకు వ్యాఖ్యలు చేశారు. సమావేశం అనంతరం ఎన్డీఏ నేతలకు, ఎంపీలకు ప్రధాని మోదీ చేసిన కీలక సూచనలను కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు మీడియాకు తెలిపారు. ఈ సమావేశంలో నీట్ పరీక్ష పేపర్ లీక్, స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలు (ఎఫ్టీఏలు), దేశ ఆర్థిక పురోగతి తదితర అంశాలపై...