నాకు ఎవరేం పని చేసినా నచ్చదంటున్న వెంకీ

టాలీవుడ్ యాక్టర్ వెంకటేశ్‌, స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబోలో వస్తున్నచిత్రం ‘ఆదర్శ కుటుంబం’ (AK47) (Aadarsha Kutumbham). వెంకీ 77వ చిత్రంగా (#Venky77) తెరకెక్కుతున్న ఈ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ను గాంధీ జయంతి సందర్భంగా, అక్టోబర్ 2వ తేదీన ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల చేస్తున్నట్టు ప్రకటించారని తెలిసిందే. ప్రతి కుటుంబం గుర్తుపెట్టుకోవాల్సిన తేదీ.. అక్టోబర్ 2న ఆదర్శ కుటుంబం తలుపులు తెరుచుకోబోతున్నాయి..అంటూ మేకర్స్ హైప్ పెంచేస్తున్నారు.