అదృశ్యమై ఏడో రోజు కావోస్తున్నా కనిపించని రెండేళ్ల చిన్నారి జ్ఞానేశ్వరి జాడ - మరికొన్ని కొత్త అంశాలపై దృష్టి సారించిన పోలీసులు - శునకానికి జీపీఎస్ ట్రాకర్ అమర్చి విశ్లేషిస్తున్న పోలీసులు

: కాకినాడ జిల్లా తుని మండలం దొండవాక పంచాయతీ సీహెచ్ అగ్రహారానికి చెందిన రెండేళ్ల చిన్నారి జ్ఞానేశ్వరి అదృశ్యమై ఏడు రోజులవడంతో పోలీసులు మరికొన్ని కొత్త అంశాలపై దృష్టి సారించారు. ఈనెల 6 నుంచి చిన్నారి ఉండే తోటతోపాటు సుమారు వెయ్యి ఎకరాల వరకు కొండ, అటవీ ప్రాంతాన్ని ప్రత్యేక బలగాలు జల్లెడ పడుతూ వచ్చిన విషయం తెలిసిందే. తాజాగా జానూతోపాటు అదృశ్యమై తిరిగి వచ్చిన పెంపుడు శునకం మెడకు జీపీఎస్ ట్రాకర్ని అమర్చి విశ్లేషిస్తున్నారు. శునకం ఎక్కువ సమయం ఉన్నచోటకు వెళ్లి పరిశీలిస్తున్నారు. చిన్నారి నివాసం నుంచి సీహెచ్ అగ్రహారం, దొండవాక గ్రామాల్లోని ప్రధాన రహదారులు, తోటలు తిరిగి శునకం ఇంటికి చేరుకుంది. రహదారిపై...