విధి నిర్వహణలో మానవత్వం.. భుజాన మోసి బాలిక ప్రాణం కాపాడిన వార్డెన్

పార్వతీపురం మన్యం జిల్లాలోని గుమ్మలక్ష్మీపురం గిరిజన ఆశ్రమ పాఠశాల వార్డెన్‌ హేమ.. ఓ విద్యార్థిని పట్ల మానవత్వం చూపారు. తీవ్ర జ్వరంతో బాధపడుతున్న బాలికను భుజంపై ఎత్తుకుని సుమారు 6 కిలోమీటర్ల మేర నడుచుకుంటూ వెళ్లి ఆస్పత్రిలో చేర్పించారు. సకాలంలో వైద్యం అందేలా చేసి విద్యార్థిని ప్రాణాన్ని కాపాడారు. ఈ విషయమై ఏపీ మహిళా కమిషన్ చైర్‌పర్సన్ రాయపాటి శైలజ స్పందిస్తూ.. వార్డెన్‌ హేమను అభినందించారు. సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా ఆమెపై ప్రశంసలు కురిపించారు. సేవాభావంతో పనిచేసే మీలాంటి అధికారులు.. ప్రతి ఒక్కరికీ ఆదర్శం కావాలని కొనియాడారు. ‘మానవత్వం, సేవాభావం, విధి పట్ల నిబద్ధతకు నిలువెత్తు నిదర్శనంగా నిలిచిన పార్వతీపురం మన్యం జిల్లా గుమ్మలక్ష్మీపురం...