దోషులను కఠినంగా శిక్షించాలి.
రామ్ మందిర్ విరాళాల వివాదంపై రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) శుక్రవారం స్పందించింది. అయోధ్య హుండీల నుంచి డబ్బులు దొంగతనం చేయటంపై ఆర్ఎస్ఎస్ తీవ్ర విచారం వ్యక్తం చేసింది. ఈ సంఘటన ఎంతో బాధ కలిగించిందని పేర్కొంది. ఈ మేరకు రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ జనరల్ సెక్రటరీ దత్తాత్రేయ హొసబలే న్యూఢిల్లీ నుంచి ఓ ప్రకటన విడుదల చేశారు. ఆ ప్రకటనలో.. దోషులను కఠినంగా శిక్షించాలని ఆయన అన్నారు. ఆలయ నిర్వహణలో లోపాలను సరిదిద్దాలని కోరారు. దేశ వ్యతిరేక శక్తుల కుట్రలను తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. దత్తాత్రేయ హొసబలే తన ప్రసంగంలో.. ‘ఈ ఘటన కోట్లాది మంది రామభక్తుల నమ్మకాన్ని, హిందూ సమాజం సెంటిమెంట్లను తీవ్రంగా గాయపరిచింది....